ముంబై రైల్వేస్టేషన్ లో తొక్కిసలాట.. ప్రాణాలు కోల్పోయిన 22 మంది ప్రయాణికులు!

  • నాలుగు రైళ్లు స్టేషన్ కు ఒకేసారి చేరుకోవడంతో ప్రయాణికుల హడావిడి  
  • తొక్కిసలాటలో 22 మంది మృతి.. 50 మందికి గాయాలు
ముంబైలో దారుణం చోటుచేసుకుంది. ముంబైలోని ఎల్ఫిన్ స్టోన్ లోకల్ రైల్వేస్టేషన్ మీదుగా పలు రైళ్లు రావాల్సి ఉండడంతో భారీ సంఖ్యలో ప్రయాణికులు చేరుకున్నారు. ఇంతలో ఒక్కసారిగా భారీ వర్షం ప్రారంభమైంది. అదే సమయంలో నాలుగు రైళ్లు స్టేషన్ కు వచ్చాయి. దీంతో ప్రయాణికులు హడావిడిగా దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది.

ఈ తొక్కిసలాటలో 22 మంది ప్రాణాలుకోల్పోగా, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రుల్లో చేర్చారు. దీనిపై కేసు నమోదు చేసిన రైల్వే శాఖ, దర్యాప్తు ప్రారంభించింది. రైల్వే మంత్రి పియూష్ గోయల్ సంఘటనా స్థలికి బయల్దేరారు. 
Go Back to Shorts
mumbai
elsin railway station
stump-aid

More Telugu News